నీ క్రీగంటి చూపు కొన తాకిన చాలు
కవులు గాయకులౌదురు మందమతులు.
తళుక్కుమను  నీ చిరునవ్వు
ఇంచుక కూడ తోచని అమవసనిశిని... 
ఈ క్షుద్ర కవోష్ణ కాంక్షా జ్వాలల
దగ్ధమైపోనిమ్మీదేహమ్ముసర్వమ్ము... 
సేదదీరుదు ఆ శీతలభస్మరాశిని
అమ్మనన్ను బ్రోవుము నమ్మితి నిన్నె ఆత్మ నిండా.








No comments: